ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉదయం రద్దీ.. మధ్యాహ్నం నుంచి నిర్మానుష్యం

ABN, First Publish Date - 2021-05-07T05:05:13+05:30

గోపాలపట్నంలో కర్ఫ్యూ పకడ్బందీగా అమలు అవుతోంది. ఉదయం 6 నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుంచే మార్కెట్‌లకు రద్దీ పెరిగింది.

ఉదయం రద్దీగా ఉన్న పెందుర్తి రైతుబజారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ఫ్యూ పకడ్బందీగా అమలు

ఉదయం వేళ దుకాణాలు, రైతుబజార్లకు పోటెత్తుతున్న జనం

కొన్ని చోట్ల భౌతిక దూరం పాటించని వైనం

మధ్యాహ్నం నుంచి రోడ్లన్నీ ఖాళీ


గోపాలపట్నం, మే 6: గోపాలపట్నంలో కర్ఫ్యూ పకడ్బందీగా అమలు అవుతోంది. ఉదయం 6  నుంచి 12 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుంచే మార్కెట్‌లకు రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌ ముగిసే సమయం వరకు ప్రధాన రహదారిలోని దుకాణ సముదాయాలు, మార్కెట్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఒకవైపు కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నా మార్కెట్‌లలో మాత్రం రద్దీ తగ్గడం లేదు. ఈ నెలలో పెళ్లిళ్లు కూడా అధికంగా ఉండడంతో ముందుగా ముహూర్తాలు పెట్టుకున్నవారు పెళ్లి దుస్తులు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి వస్తుండడంతో షాపింగ్‌ మాల్స్‌ కిటకిటలాడుతున్నాయి. 

రైతుబజారులో రద్దీ

పెందుర్తి: కర్ఫ్యూ నేపథ్యంలో పెందుర్తి రైతుబజారు గురువారం ఉదయం కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. జనం భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ కూరగాయలు కొనుగోలు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే మధ్యాహ్నం 12 నుంచి ఆ ప్రాంతం నిర్మానుష్యంగా కనిపించింది. ప్రధాన రహదారులు కూడా బోసిపోయాయి.



Updated Date - 2021-05-07T05:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising