ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదకొండమ్మ అమ్మవారి పాదాలు ధ్వంసం

ABN, First Publish Date - 2021-06-21T05:35:29+05:30

మోదకొండమ్మ వారి పాదాలను ఇద్దరు యువకులు ధ్వంసం చేయడంతో మండలంలోని ఐతంపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐతంపూడిలో ఇద్దరు యువకుల దుశ్చర్య

పట్టుకుని నిలదీసిన గ్రామస్థులు

పోలీసులకు ఫిర్యాదు... కేసు నమోదు


బుచ్చెయ్యపేట(విశాఖ జిల్లా), జూన్‌ 20: మోదకొండమ్మ వారి పాదాలను ఇద్దరు యువకులు ధ్వంసం చేయడంతో మండలంలోని ఐతంపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్థులు వీరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాల మేరకు...

ఐతంపూడి గ్రామానికి చెందిన బండి సతీశ్‌, మాడుగులకు చెందిన శివ ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై మోదకొండమ్మ అమ్మవారి పాదాలు వున్న మందిరం వద్దకు వచ్చి అమ్మవారి పాదాలను  ధ్వంసం చేశారు. ఇది గమనించిన స్థానికులు వారిని పట్టుకుని నిలదీశారు. దీంతో యువకులు గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. సర్పంచ్‌ పెద్దాడ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో  చోడవరం సీఐ ఇలియాస్‌ మహ్మద్‌, ఎస్‌ఐ బి.రామకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అమ్మవారి పాదాలను పరిశీలించారు. స్థానికులను విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. సతీశ్‌ అమ్మవారి పాదల వద్ద వున్న సామగ్రిని ధ్వంసం చేశాడని, అప్పుడు మందలించి వదిలేశామని స్థానికులు తెలిపారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.


Updated Date - 2021-06-21T05:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising