గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు: Minister balineni
ABN, First Publish Date - 2021-11-10T18:02:55+05:30
గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు.
విశాఖపట్నం: గంజాయి అక్రమ రవాణా అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి బాలినేని శ్రీనివాస్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ 1995 నుండి అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో విధి నిర్వహణలో భాగంగా 22 మంది అమరులు అయ్యారని... వారి కుటుంబాలకు ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అటవీ సంపద కాపాడడంలో అటవీ శాఖ సిబ్బంది చేస్తున్న సేవలు వెల కట్టలేనివని కొనియాడారు. గంజాయి సాగు, అక్రమ రవాణా ఇప్పటికప్పుడు పుట్టుకొచ్చింది కాదని, గత ప్రభుత్వం నుండి ఇది కొనసాగుతోందన్నారు. ఏజెన్సీలో మౌలికవసతుల, ఏర్పాటు గిరిజనులకు ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి బాలినేని శ్రీనివాస్ పేర్కొన్నారు.
Updated Date - 2021-11-10T18:02:55+05:30 IST