మంత్రి అవంతి నివాసం ముందు మృతుడి బంధువుల ఆందోళన
ABN, First Publish Date - 2021-11-10T14:32:07+05:30
మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొనడంతో సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.
విశాఖపట్నం: మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొనడంతో సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం మంత్రి నివాసం ముందు నిరసనకు దిగారు. నిన్న సీఎం కాన్వాయ్లో ఎయిర్పోర్టు నుంచి వస్తుండగా మంత్రి వాహనం ఢీకొనడంతోనే సూర్యనారాయణ మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. సీసీ పూటేజీలో మంత్రి వాహనమే ఢీ కొట్టినట్లు చూసామని బంధువులు వెల్లడించారు. తమ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతుడు సూర్యనారాయణ స్వస్థలం విజయనగరంజిల్లా గజపతినగరం. మృతుడి కుటుంబ సభ్యుల ఆందోళనతో మంత్రి ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. సూర్యనారాయణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Updated Date - 2021-11-10T14:32:07+05:30 IST