ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో విద్యార్థుల్లో మానసిన ఉల్లాసం

ABN, First Publish Date - 2021-03-24T06:06:06+05:30

క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుంటున్న ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఐటీ డీఏ పీవో వెంకటేశ్వర్‌ 

పాడేరు, మార్చి 23: క్రీడలు విద్యార్థుల మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఐటీడీఏ పీవో డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ అన్నారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల ఆవరణలో మంగళవారం జోనల్‌ స్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా  పీవో మాట్లాడుతూ.. ఏజెన్సీలో పాడేరు, చింతపల్లి, పెదబయలు, అరకులోయ జోన్‌లుగా విభజించి పాఠశాల క్రీడా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఆసక్తి చూపే వాలీబాల్‌, ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, వ్యాయమ క్రీడల్లో జోనల్‌ స్థాయిలో పోటీలు అనంతరం విజేతలతో డివిజన్‌ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారన్నారు. గిరి విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని పీవో వెంకటేశ్వర్‌ ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో గిరిజన సంక్షేమ విద్యా శాఖ డీడీ జి.విజయకుమార్‌, ఏటీడబ్ల్యూవో ఎల్‌.రజని, మూడు మండలాలకు చెందిన వ్యాయామ సంచాలకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-24T06:06:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising