12 గంటల్లోగా ఇళ్లకు చేరేలా చూడండి
ABN, First Publish Date - 2021-05-06T05:26:11+05:30
కర్ఫ్యూ కారణంగా ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 12 గంటల్లోగా ఇళ్లకు చేరేలా చూడాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశించారు.
జిల్లా ఎస్పీ కృష్ణారావు
అనకాపల్లి టౌన్, మే 5: కర్ఫ్యూ కారణంగా ప్రతి ఒక్కరూ మధ్యాహ్నం 12 గంటల్లోగా ఇళ్లకు చేరేలా చూడాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశించారు. బుధవారం అనకాపల్లి వచ్చి ఎస్పీ కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ఫ్యూ కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీసు అధికారులకు వివరించారు. అత్యవసర పనులపై ఎవరైనా బయటకు వస్తే పరిస్థితిని గమనించి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై పిచ్చాపాటిగా ఎవరైనా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కర్ఫ్యూ విజయవంతమయ్యేలా పక్కా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దిశ మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ మళ్ల మహేశ్వరరావు, సీఐలు ఎల్.భాస్కరరావు, సిహెచ్.ప్రసాద్, ఎస్ఐలు ఆర్.ధనుంజయ్, ఎల్.రామకృష్ణ, ఎ.స్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-05-06T05:26:11+05:30 IST