ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా తాటి ముంజెల విక్రయాలు

ABN, First Publish Date - 2021-04-24T05:07:01+05:30

వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజెలు ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే శీతల పానీయాల కన్నా తాటి ముంజెలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సైతం చెబుతున్నారు.

తాటి ముంజెలను ఒలుస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లంకెలపాలెం, ఏప్రిల్‌ 23: వేసవి ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తాటి ముంజెలు ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే శీతల పానీయాల కన్నా తాటి ముంజెలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని వైద్యులు సైతం చెబుతున్నారు. దీంతో వాటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కాగా విజయనగరం, బొబ్బిలి, ఎల్‌ కోట, పార్వతీపురం మండలాల నుంచి కళ్లు గీత కార్మికులు కుటుంబాలతో సహా వేసవి సీజన్‌లో ఇక్కడికి వలస వస్తుంటారు. లంకెలపాలెం,  అగనంపూడి ప్రాంతాల్లో జాతీయ రహదారి ఇరుపైపులా దుకాణాలను ఏర్పాటు చేసి తాటి ముంజెలను విక్రయిన్నారు. సబ్బవరం పరవాడ మండలాల్లో చెట్ల నుంచి సేకరించిన తాటి ముంజెలను ఆటోల్లో ఇక్కడికి తరలిస్తున్నారు. వాటిని ఒలిచి డజను ముంజెలు రూ.20 నుంచి రూ.25కు విక్రయిస్తున్నారు. వీటి విక్రయాల వల్ల ఖర్చులు పోనూ రూ.500 వరకు ఆదాయం వస్తుందని వారు చెబుతున్నారు. 

Updated Date - 2021-04-24T05:07:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising