పీహెచ్సీల్లో కొవిడ్ వ్యాక్సిన్
ABN, First Publish Date - 2021-01-21T05:56:54+05:30
స్థానిక పీహెచ్సీలో వ్యాక్సినేషన్ను నర్సీపట్నం సబ్కలెక్టర్ మౌర్య ప్రారంభించారు.
మాకవరపాలెం, జనవరి 20: స్థానిక పీహెచ్సీలో వ్యాక్సినేషన్ను నర్సీపట్నం సబ్కలెక్టర్ మౌర్య ప్రారంభించారు. మొత్తం 100 మందికిగాను 63 మంది మాత్రమే టీకా వేయించుకున్నారు. మిగిలిన వారు వివిధ కారణాల వల్ల వ్యాక్సిన్కు రాలేదని వైద్యాధికారులు తెలిపారు.
రాంబిల్లి: మండల కేంద్రంలోని పీహెచ్సీలో 98 మందికిగాను 86 మందికి టీకా వేసినట్టు వైద్యాధికారిణి జి.అమృతసాయి తెలిపారు.
పాయకరావుపేట: స్థానిక పీహెచ్సీలో 86 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా 62 మంది హాజరైనట్టు వైద్యాధికారిణి శిరీష తెలిపారు.
నాతవరం : గునుపూడి పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కోసం ఒక్కరు మాత్రమే ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోగా, ఆ ఒక్కరు కూడా రాలేదని డాక్టర్ సురేశ్ తెలిపారు. ఇక్కడి ఏర్పాట్లను సబ్కలెక్టర్ మౌర్య పరిశీలించారు.
గొలుగొండ : స్థానిక కస్తూర్బా పాఠశాలలో బుధవారం 138 మందికి 110 మందికి గొలుగొండ పీహెచ్సీ వైద్యులు టీకా వేశారు. సబ్ కలెక్టర్ మౌర్య ఏర్పాట్లను పరిశీలించారు.
మునగపాక : మునగపాక పీహెచ్సీలో 100 మందికి టీకా వేయాల్సి ఉండగా, 82కి వేశామని వైద్యధికారి అనిల్కుమార్ తెలిపారు.
పాయకరావుపేట : ఇక్కడి పీహెచ్సీలో 86 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా 62 మందికి వేసినట్టు వైద్యాధికారి డాక్టర్ శిరీష తెలిపారు.
నర్సీపట్నం : ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ బుధవారం నిలిచిపోయింది. పోర్టర్లో టీకా వేయించుకునే వారి జాబితా రాకపోవడంతో ఎవరికీ వేయలేదు.
Updated Date - 2021-01-21T05:56:54+05:30 IST