మల్లవరంలో భారీగా కోడి పందాలు, పేకాట?
ABN, First Publish Date - 2021-01-19T06:20:27+05:30
మల్లవరంలో సోమవారం నందీశ్వర తీర్థం సందర్భంగా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహించారు.
వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహణ - చోద్యం చూసిన పోలీసులు!
అచ్యుతాపురం, జనవరి 18 : మల్లవరంలో సోమవారం నందీశ్వర తీర్థం సందర్భంగా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహించారు. గ్రామం పక్కనే గల కొండ వద్ద జరిగిన ఈ పందాలకు అచ్యుతాపురంతో పాటు మునగపాక, పరవాడ, ఎలమంచిలి మండలాల నుంచి పందెం రాయుళ్లు విచ్చేశారు. వారం రోజుల నుంచి పందెం రాయుళ్లకు మల్లవరం నాయకులు సమాచారం పంపినట్టు తెలిసింది. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోక పోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, నరేంద్రపురం తోవలో గల ఒక గృహంలో భారీ స్థాయిలో పేకాట జరిగినట్టు స్థానికులు చెపుతున్నారు. వైసీపీ నాయకులు కనుసన్నల్లో లక్షల్లో పందాలు జరిగాయని, ఇందులో వైసీపీ నాయకులు భారీగా దండుకున్నారని బహిరంగంగానే ప్రచారంలో ఉంది. అధికార పార్టీకి చెందిన వారు కావడం వల్లే పోలీసులు పట్టించుకోలేదని పలువురంటున్నారు.
Updated Date - 2021-01-19T06:20:27+05:30 IST