రైతులకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ
ABN, First Publish Date - 2021-01-27T05:56:15+05:30
ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం వివిధ రాజకీయ, ప్రజా, పౌర, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు.
సిరిపురం, జనవరి 26: ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం వివిధ రాజకీయ, ప్రజా, పౌర, విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, బ్యాంక్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ రామాటాకీ స్ మీదుగా మద్దిలపాలెం, గురుద్వారా, ఆర్టీసీ కాంప్లెక్స్, అంబేడ్కర్ సర్కిల్ మీదుగా తిరిగి గాంధీ విగ్రహం వద్దకు చేరింది. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, జాతీయ జెండాలను చేతపట్టుకుని, టీషర్ట్లు ధరించి ప్రదర్శన చేపట్టారు. అనంతరం పలువురు వక్తలు మాట్లాడుతూ రైతులకు తీవ్ర విఘాతం కలిగించే నూతన వ్యవసాయ చట్టాల వల్ల ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, నగర కార్యదర్శి ఎం.పైడిరాజు, కాంగ్రెస్ నాయకులు జీఏ నారాయణరావు, పేడాడ రమణికుమారి, ఎస్.వెంకటేశ్వరరావు, సీపీఐ నాయకులు ఎం.లక్ష్మి, ఎంసీసీఐయూ నాయకుడు కె.శంకరరావు, ఏపీ మహిళా అధ్యక్షురాలు ఎ.విమల, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-27T05:56:15+05:30 IST