ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీం తీర్పుతో ప్రభుత్వ కుయుక్తులు బట్టబయలు

ABN, First Publish Date - 2021-01-27T06:28:45+05:30

సుప్రీం కోర్టు తీర్పుతో ప్రభుత్వ కుయుక్తులు బట్టబయలయ్యాయని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు.

ఎలమంచిలిలో అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు


ఎలమంచిలి/అచ్యుతాపురం/మునగపాక: సుప్రీం కోర్టు తీర్పుతో ప్రభుత్వ కుయుక్తులు బట్టబయలయ్యాయని ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు. ఎలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో మంగళవారం డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎలమంచిలి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు.

అచ్యుతాపురంలో ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు మాట్లాడుతూ, కోర్టులు ఎన్ని మొట్టికాయలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వ తీరు మారకపోవడం సిగ్గుచేటన్నారు. ఇటువంటి నియంతలు ఉంటారని ఊహించే అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారన్నారు. కార్యక్రమంలో తెలుగుమహిళ జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు, నాయకులు డొక్కా నాగభూషణం, ఎం.కె.వీరరాజశేఖర్‌, మాధవరావు పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు కొఠారు సాంబ, పెయ్యల రామకృష్ణ, దత్తాత్రేయ, నాగేశ్వరావు, జనపరెడ్డి నరసింగరావు, కె.రమణ, ఎ.సాంబశివరావు, పుర్రే శ్రీనివాస యదవ్‌, లాలం రాము పాల్గొన్నారు.

Updated Date - 2021-01-27T06:28:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising