ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాలర్‌ ఢీకొని బాలిక మృతి

ABN, First Publish Date - 2021-12-08T05:15:23+05:30

తినుబండారాల కోసం రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని ట్రాలర్‌ ఢీకొంది. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

భావన (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెందుర్తి, డిసెంబరు 7: తినుబండారాల కోసం రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని ట్రాలర్‌ ఢీకొంది. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన పెందుర్తి- కొత్తవలస రహదారి పాత పెందుర్తి వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాత పెందుర్తికి చెందిన మళ్ల సత్తిబాబు,లక్ష్మి దంపతుల కుమారై భావన(7) స్థానిక ప్రాథమిక పాఠశాలలో రెండవ తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలకు వెళ్లిన ఆ బాలిక ఉదయం విరామ సమయంలో తినుబండారాలు కొనేందుకు బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా కొత్తవలస నుంచి ఐరన్‌ లోడ్‌తో వేగంగా  వస్తున్న ట్రాలర్‌ బలంగా ఢీకొంది. దీంతో ఆ బాలిక శరీరం ఛిద్రమైంది.  సీఐ అశోక్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరు కుని ప్రమాదానికి కారణమైన ట్రాలర్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-08T05:15:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising