ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘోరం

ABN, First Publish Date - 2021-05-06T05:13:11+05:30

విశాఖలో కరోనాతో మృతిచెందిన సోదరుడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన కుటుంబాన్ని మార్గమధ్యంలో మృత్యువు కాటేసింది.

ప్రమాదానికి గురైన కారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోదరుడి అంత్యక్రియలకు వస్తుండగా...కబళించిన మృత్యువు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

మృతులు విజయవాడ వాసులు


ఎస్‌.రాయవరం, మే 5: విశాఖలో కరోనాతో మృతిచెందిన సోదరుడికి అంత్యక్రియలు నిర్వహించేందుకు విజయవాడ నుంచి బయలుదేరిన కుటుంబాన్ని మార్గమధ్యంలో మృత్యువు కాటేసింది. విశాఖపట్నం జిల్లా ఎస్‌.రాయవరం మండలం అడ్డరోడ్డు-గోకులపాడు మధ్య జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఇందుకు సంబంధించి ఎస్‌.రాయవరం ఎస్‌ఐ చక్రధర్‌ తెలిపిన వివరాలివి. విజయవాడకు చెందిన కొల్లా కృష్ణమోహన్‌ (45) కొన్నేళ్ల కిందట కుటుంబంతో విశాఖ వచ్చి రియల్టర్‌గా స్థిరపడ్డారు. ఇటీవల ఆయనకు కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు ఓ ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం ఆయన మృతిచెందారు. ఈ విషయం తెలిసి విజయవాడలో వుంటున్న కృష్ణమోహన్‌ అన్న శ్రీనివాసరావు (47), మామ జాస్తి శివనాగేశ్వరరావు (60), కె.భాస్కరరావు, వెంకటదుర్గాప్రసాద్‌ మంగళవారం రాత్రి కారులో విశాఖపట్నం బయలుదేరారు. వీరి వాహనం  బుధవారం తెల్లవారుజామున అడ్డరోడ్డు హైవే జంక్షన్‌ దాటిన తరువాత మదుంను ఢీకొంది. దీంతో శ్రీనివాసరావు, శివనాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.  గాయలతో బయటపడిన భాస్కరరావు, వెంకటదుర్గాప్రసాద్‌లను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు. 

Updated Date - 2021-05-06T05:13:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising