ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ: పెందుర్తిలో ఫ్లై ఓవర్ కష్టాలు...

ABN, First Publish Date - 2021-09-03T18:18:26+05:30

విశాఖ: నగరంలో కూడా అమరావతి రైతుల పరిస్థితి వెంటాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో కూడా అమరావతి రైతుల పరిస్థితి వెంటాడుతోంది. తమ భూములకు అధికారులు అతి తక్కువ ధర నిర్ణయించి నట్టేట ముంచారని పెందుర్తి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా అధికారులు ఫ్లై ఓవర్ నిర్మాణం పనులు చేపడితే ఆత్మహత్య తప్ప వేరే గత్యంతరం లేదని రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


పెందుర్తి మండలంలోని 164 సర్వే నెంబర్‌కు చెందిన తమ భూములకు నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తప్పులు చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రక్కనే ఉన్న తమ భూములను కమర్షియల్, రెసిడెన్షియల్ ప్రకారం ధర నిర్ణయించాలని రైతులు డిమాండ్ చేశారు. 2018లో  నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా  విడుదల చేసిన నోటిఫికేషన్ నాటికి సబ్ రిజిష్టార్ విలువ గజానికి రూ. 12,500 ఉండగా.. ఇప్పుడు గజం ధర రూ. 1,925కే ప్రకటించి అధికారులు చాలా పెద్ద తప్పు చేశారని విమర్శించారు. తమ భూముల విషయంలో న్యాయం చేయాలని లేదంటే గజం స్థలం కూడా తీసుకోలేరని రైతులు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

Updated Date - 2021-09-03T18:18:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising