ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యల పరిష్కారానికి కృషి
ABN, First Publish Date - 2021-10-28T06:20:20+05:30
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్, మునిసిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి బుధవారం సందర్శించారు.
ఎమ్మెల్యే ఉమాశంకర్గణేశ్
నర్సీపట్నం, అక్టోబరు 27 : పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్, మునిసిపల్ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి బుధవారం సందర్శించారు. కళాశాల తరగతి గదుల్లో సమస్యలను విద్యార్థులు, అధ్యాపకుల ద్వారా తెలుసుకున్నారు. తాగునీరు, మరుగుదొడ్ల తదితర సమస్యలు ఉన్నట్టు వారు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో కళాశాలలోని పదిహేను తరగతి గదులను పదిహేను మంది వైసీపీ నాయకులు దత్తత తీసుకొని రంగులు, మైనర్ రిపేర్లు చేయిస్తారని తెలిపారు. అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గొలుసు నర్సింహమూర్తి, గొలుగొండ జడ్పీటీసీ గిరిబాబు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-28T06:20:20+05:30 IST