ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి

ABN, First Publish Date - 2021-10-20T06:44:36+05:30

మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు.

డ్వాక్రా గ్రూప్‌లకు చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఫాల్గుణ, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే ఫాల్గుణ

ముంచంగిపుట్టు, అక్టోబరు 19: మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేవిధంగా  రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయ ఆవరణలో మంగళవారం 374 డ్వాక్రా గ్రూపుల మహిళలకు రూ.64.36 లక్షల చెక్కును ఎమ్మెల్యే ఫాల్గుణ, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ పేద కుటుంబంలో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆసరా, అమ్మ ఒడి, చేయూత వంటి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరిసెల సీతమ్మ, వెలుగు ఏపీడీ మురళి, స్వచ్ఛాంధ్ర పుడ్‌ కార్పొరేషన్‌ మెంబర్‌ సోమేశ్వరి, సర్పంచ్‌లు ఎస్‌.సుభాశ్‌, వి.రమేశ్‌, బాబూరావు, నరసింగరావు, రత్న పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T06:44:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising