ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

ABN, First Publish Date - 2021-01-21T04:48:17+05:30

కరోనా వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలకు గురికాకుండా అందరూ టీకాలు వేయించుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న మంత్రి ముత్తంశెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

పద్మనాభం, జనవరి 20: కరోనా వ్యాక్సిన్‌పై ఎటువంటి అపోహలకు గురికాకుండా అందరూ టీకాలు వేయించుకోవాలని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని వెంకటాపురం సచివాలయంలో రేవిడి పీహెచ్‌సీ పరిధిలోని ఆరోగ్య సిబ్బందికి నిర్వహించిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వందమంది సిబ్బందికి స్లాట్‌ ఇవ్వగా 94 మందికి వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అయినాడకు చెందిన ఆశ కార్యకర్త కళావతికి వ్యాక్సిన్‌ వేయించుకున్నాక కళ్లు తిరిగినట్టు అనిపించడంతో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ‘భీమిలి‘ ఇన్‌చార్జి ఎం.మహేశ్‌, మండల ప్రత్యేకాధికారి కె.రాజేశ్వరి, ఎంపీడీవో జీవీ చిట్టిరాజు, తహసీల్దార్‌ ఎ.శ్రీనివాసరావు, రేవిడి పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సమత, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-01-21T04:48:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising