డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ పంపిణీ
ABN, First Publish Date - 2021-04-24T05:19:23+05:30
మునిసిపాలిటీ పరిధిలోని డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేశ్ శుక్రవారం పంపిణీ చేశారు.
నర్సీపట్నం, ఏప్రిల్ 23 : మునిసిపాలిటీ పరిధిలోని డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్గణేశ్ శుక్రవారం పంపిణీ చేశారు. మెప్మా విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన కార్యక్రమంలో 11,043 డ్వాకా సంఘాలకు రూ.2.3 కోట్ల సున్నా వడ్డీ రాయితీ మంజూరు పత్రాలను అందజేశారు. చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, కమిషనర్ కనకారావు, వైస్ చైర్మన్ గొలుసు నర్సింహమూర్తి, వైసీపీ నాయకులు చింతకాయల సన్యాసిపాత్రుడు, గుడిబండి నాగేశ్వరరావులతోపాటు పలువురు కౌన్సిలర్లు, మెప్మా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2021-04-24T05:19:23+05:30 IST