కర్ఫ్యూ పక్కాగా అమలు
ABN, First Publish Date - 2021-05-13T05:14:52+05:30
కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ పక్కాగా అమలు జరుగుతున్నది. ఉదయం 6 నుంచి 12 గంటల మధ్య జనం తమ అవసరాలకు వచ్చి తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు.
కూర్మన్నపాలెం, మే 12: కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ పక్కాగా అమలు జరుగుతున్నది. ఉదయం 6 నుంచి 12 గంటల మధ్య జనం తమ అవసరాలకు వచ్చి తిరిగి ఇళ్లకు వెళ్లిపోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలు దాటాక పోలీసులు వాహనాలలో తిరుగుతూ హెచ్చరించటంతో వివిధ దుకాణాలు మూతపడ్డాయి. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రోడ్లపై ప్రజలు, వాహనాలు తిరగకుండా ప్రతి జంక్షన్లోనూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
Updated Date - 2021-05-13T05:14:52+05:30 IST