వరద ముంపులో పంట పొలాలు
ABN, First Publish Date - 2021-09-29T06:20:03+05:30
గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు వరి, చెరకు తోటలు ముంపునకు గురయ్యాయి.
మాడుగుల రూరల్, సెప్టెంబరు 28: గులాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు వరి, చెరకు తోటలు ముంపునకు గురయ్యాయి. మంగళవారం మెరుపులు, ఉరుములతో కుండపోత వర్షం పడింది. దీంతో మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీరవిల్లి అగ్రహారం, పోతనపూడి అగ్రహారం, జంపెన, వీరనారాయణంల్లో వరి చేను, చెరకు తోటలు ముంపునకు గురయ్యాయి. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తున్నది.
తుఫాన్ వర్షాలకు నీటమునిగిన పంట పొలాలు
చీడికాడ మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న తుఫాన్ వర్షాలకు తునివలస, దండిసురవరం గ్రామాల్లో వరి పంట ముంపునకు గురైంది. అలాగే చీడికాడతోపాటు పలు గ్రామాల్లో చెరకు తోటలు నేలమట్టం అయ్యాయి.
Updated Date - 2021-09-29T06:20:03+05:30 IST