బీజేపీపై మండిపడ్డ సీపీఎం నేత మధు
ABN, First Publish Date - 2021-10-26T16:33:28+05:30
బీజేపీపై సీసీఎం నేత మధు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు.
విశాఖపట్నం: బీజేపీపై సీసీఎం నేత మధు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ హిందూ రాజ్యం ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు. బీజేపీకి జగన్ వంత పాడుతున్నారని ఆరోపించారు. స్టీల్ ప్రైవేటీకరణ ఉద్యమానికి పవన్ మద్దతు ఇవ్వడం మంచి పరిణామమే అని అన్నారు. బీజేపీ కూటమి నుంచి ప్రాంతీయ పార్టీలు బయటకు రావాలని.. లేదంటే ప్రాంతీయ పార్టీలు బలహీన పడతాయని మధు చెప్పుకొచ్చారు.
Updated Date - 2021-10-26T16:33:28+05:30 IST