అప్పన్నను దర్శించుకున్న సీపీ దంపతులు
ABN, First Publish Date - 2021-06-14T05:42:49+05:30
వరాహలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం నగర పోలీస్ కమిషనర్ మనీశ్కుమార్ సిన్హా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు.
సింహాచలం, జూన్ 13: వరాహలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం నగర పోలీస్ కమిషనర్ మనీశ్కుమార్ సిన్హా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. సీపీ దంపతులకు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ ఆహ్వానం పలకగా, అర్చకులు గోత్రనామాలతో పూజలు చేసి శేషవస్త్రాన్ని వేశారు. గోదాదేవి అమ్మవారి దర్శనానంతరం పండితులు ఆశీర్వచనాలివ్వగా, ఈవో స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అర్చకులు క్షేత్ర మహాత్మ్యం, స్వామివారి అవతార రహస్యం, ఆలయ శిల్ప సంపద విశిష్టతను వారికి వివరించారు.
Updated Date - 2021-06-14T05:42:49+05:30 IST