ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా మృతుల కుటుంబాలను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-06-17T06:03:56+05:30

కరోనా వలన మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని గాజువాక తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాజువాక, జూన్‌ 16: కరోనా వలన మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని గాజువాక తెలుగుదేశం పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. కరోనా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం గాజువాక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆక్సిజన్‌ అందక మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వాలని, ఉపాధి కోల్పోయిన తెల్ల కార్డుదారులకు పది వేల ఆర్థిక సహాయం అందజేయాలన్నారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాస్‌, బొండా జగన్‌, మొల్లి ముత్యాలనాయుడు, పులి లక్ష్మిభాయి, సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, నాయకులు పుచ్చా విజయ్‌కుమార్‌, పెద్దాడ సోమినాయుడు, వాసు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-17T06:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising