ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో భవన నిర్మాణ కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2021-10-25T04:44:54+05:30

భవనంపై పనిచేస్తున్న సమయంలో హెచ్‌టీ లైన్‌ తగిలి విద్యుదాఘాతానికి గురైన ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

వైకుంఠరావు మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలపట్నం, అక్టోబరు 24: భవనంపై పనిచేస్తున్న సమయంలో హెచ్‌టీ లైన్‌ తగిలి విద్యుదాఘాతానికి గురైన ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తపాలెంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం శేషాద్రిపురం గ్రామానికి చెందిన గెండెం వైకుంఠరావు(40) అనే భవన నిర్మాణ కార్మికుడు తన భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలతో స్థానిక పాతగోపాలపట్నంలో నివాసముంటున్నాడు. అయితే కొత్తపాలెంలోని ఖారవేలనగర్‌లో ఓ భవన నిర్మాణం పనికోసం ఆదివారం ఉదయం అతను వచ్చాడు. సాయంత్రం 5 గంటల సమయంలో భవనంపై పని చేస్తుండగా హెచ్‌టీ విద్యుత్‌ తీగలు అతనికి తగిలి భవనంపై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసి అక్కడికి వచ్చి భోరున విలపించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కాగా భవన నిర్మాణ కార్మిక సంఘం (సీటూ) నేత బి.వెంకటరావు సంఘటన స్థలానికి చేరుకుని మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


Updated Date - 2021-10-25T04:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising