టీడీపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ దినం
ABN, First Publish Date - 2021-01-27T05:09:16+05:30
పంచాయతీ ఎన్నికలు జరపాలంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం రిపబ్లిక్ డేని స్థానిక టీడీపీ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకున్నారు.
పాయకరావుపేట, జనవరి 26: పంచాయతీ ఎన్నికలు జరపాలంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం రిపబ్లిక్ డేని స్థానిక టీడీపీ నాయకులు రాజ్యాంగ పరిరక్షణ దినంగా జరుపుకున్నారు. అంబేడ్కర్ చిత్రపటానికి మండల టీడీపీ అధ్యక్షుడు పెదిరెడ్డి చిట్టిబాబు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పెదిరెడ్డి శ్రీను, యాళ్ళ వరహాలబాబు, జగతా శ్రీను, చింతకాయల రాంబాబు, సూరా సుబ్రహ్మణ్యం, పల్లా విలియంకేరి, ఎం.రమాకుమారి, పెదిరెడ్డి నాగవెంకట రమణ, దొంగల శ్రీను, సీహెచ్.పేర్రాజు పాల్గొన్నారు.
హక్కుల కోసం పోరాడాలి
రాజ్యాంగ పరిరక్షణ, హక్కుల కోసం పోరాడాలని దళిత బహుజనపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దువ్వాడ దావీదు అన్నారు. మంగళవారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. బోడపాటి రమణబాబు, అచ్చారావు, రాజు, నూకరాజు, సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-27T05:09:16+05:30 IST