యోగా పోటీల విజేతలకు కలెక్టర్ అభినందనలు
ABN, First Publish Date - 2021-06-23T05:33:56+05:30
రాష్ట్రస్థాయి ఆయుష్ యోగా పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ వినయ్చంద్ మంగళవారం అభినం దనలు తెలిపారు.
మహారాణిపేట, జూన్ 22: రాష్ట్రస్థాయి ఆయుష్ యోగా పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ వినయ్చంద్ మంగళవారం అభినం దనలు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 18 సంవత్సరాల లోపు చిన్నారులకు ఏపీ ప్రభుత్వం ఆయుష్శాఖ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్చువల్ యోగా పోటీలలో ప్రథమ బహుమతి పొందిన ఎలమంచిలికి చెందిన జి.లయవర్దన్, కన్సొలేషన్ బహుమతి పొందిన చోడవరానికి చెందిన పి.వెన్నశ్రీలకు మంగళవారం కలెక్టర్ తన చాంబర్లో బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఆయు ష్ వెద్యాధికారి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-06-23T05:33:56+05:30 IST