ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరకు రైతులను వంచించిన సీఎం జగన్‌

ABN, First Publish Date - 2021-10-17T06:47:25+05:30

జిల్లాలో చెరకు రైతులను సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం దారుణంగా వంచించిందని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న బుద్ద నాగజగదీశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద


అనకాపల్లి, అక్టోబరు 16: జిల్లాలో చెరకు రైతులను సీఎం జగన్‌రెడ్డి ప్రభుత్వం దారుణంగా వంచించిందని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు విమర్శించారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో గోవాడ, ఏటికొప్పాక, తాండవ సహకార చక్కెర కర్మాగారాల్లో చెరకు రైతులకు సుమారు రూ.60 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు. గత సీజన్‌లో సరఫరా చేసిన చెరకుకు సంబంధించిన బకాయిలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది రైతులను ఎలా ఆదుకుంటారో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రాంత రైతులు పండించిన చెరకును ఎక్కడికి తరలించాలో తెలియక అయోమయానికి గురవుతున్నారన్నారు. ప్రధానంగా చోడవరం చక్కెర కర్మాగారం యాజమాన్యం, అధికార పార్టీ నాయకులు అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వయంగా సీఎంకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. దసరాకు చెరకు రైతుల బకాయిలు చెల్లిస్తామని ముగ్గురు మంత్రులు ప్రకటన చేసినప్పటికీ అమలు కాలేదన్నారు. తక్షణమే రైతులకు చెరకు బకాయిలు చెల్లించకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని జగదీశ్‌ హెచ్చరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు ఉగ్గిన రమణమూర్తి, కె.వెంకట్రావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-17T06:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising