తుపానుతో పెరిగిన అలల ఉధృతి
ABN, First Publish Date - 2021-10-17T06:23:02+05:30
తుపాను కారణంగా పూడిమడక తీరంలో అలల ఉధృతి పెరిగింది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేదు. ఉధృతి పెరిగితే పడవలను తీరానికి దూరంగా తరలించేందుకు సిద్ధపడుతున్నారు.
వేటకు దూరంగా మత్స్యకారులు
అచ్యుతాపురం, అక్టోబరు 16: తుపాను కారణంగా పూడిమడక తీరంలో అలల ఉధృతి పెరిగింది. దీంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లలేదు. ఉధృతి పెరిగితే పడవలను తీరానికి దూరంగా తరలించేందుకు సిద్ధపడుతున్నారు. గత మూడు రోజులుగా వేటకు వెళ్లక పోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. గురువారం మత్స్యకారులకు సాధారణ సెలవు కాగా, శుక్రవారం దసరా కావడంతో వేటకు వెళ్లలేదు. శనివారం అలల ఉధృతితో ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చిందని తెలిపారు.
Updated Date - 2021-10-17T06:23:02+05:30 IST