ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శంకుస్థాపన గోతిలో పడి బాలుడి మృతి

ABN, First Publish Date - 2021-08-17T17:30:15+05:30

పట్టణంలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాయకరావుపేట: పట్టణంలోని ఓ ఇంటి ఖాళీ స్థలంలో వర్షపు నీటితో నిండిన గోతిలోపడి బాలుడు మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలివి. పాయక రావుపేటకు చెందిన పల్లంకుర్తి శ్రీను సాయి ఆదర్శనగర్‌లోని ఓ అపార్టు మెంట్‌లో పనులు చేసుకుంటూ కుటుంబంతో అందులోని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉండగా, వీరిలో రెండో కుమారుడు రాకేష్‌(7) ఆది వారం సాయంత్రం ఆడుకోవడానికి బయటకు వెళ్లాడు. రాత్రి కావస్తున్నా ఇంటికి రాకపోవడంతో తండ్రి శ్రీను చుట్టుపక్కల వారి ఇళ్లకు వెళ్లి వాకబు చేశాడు. ఫలితం లేకపోవడంతో రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ పి.ప్రసాదరావు వచ్చి పరిసరాలను పరిశీలించారు. ఆ పక్కనే ఖాళీ స్థలంలో శంకుస్థాపన కోసం గొయ్యి తీసి ఉండడాన్ని గుర్తించారు. అది వర్షపు నీటితో నిండి ఉండడంతో అనుమానం వచ్చి ఆ గోతిలో వెతికించగా, రాకేష్‌ విగతజీవిగా బయటపడ్డాడు. దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. 



Updated Date - 2021-08-17T17:30:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising