సైకిల్పై కౌన్సిల్ సమావేశానికి శరగడం హాజరు
ABN, First Publish Date - 2021-06-24T04:35:52+05:30
జీవీఎంసీ 56వ వార్డు టీడీపీ కార్పొరేటర్ శరగడం రాజశేఖర్ గవరకంచర పాలెం నుంచి జీవీఎంసీ కార్యాల యానికి బుధవారం సైకిల్పై వెళ్లారు.
ఆర్పీపేట, జూన్ 23 : జీవీఎంసీ 56వ వార్డు టీడీపీ కార్పొరేటర్ శరగడం రాజశేఖర్ గవరకంచర పాలెం నుంచి జీవీఎంసీ కార్యాల యానికి బుధవారం సైకిల్పై వెళ్లారు. ఆస్తిపన్ను, చెత్తపన్ను జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తన వాణిని కౌన్సిల్లో వినిపించేందుకు వెళ్లా రు. రెండేళ్లుగా కరోనా విజృం భణతో పనులు లేక ప్రజలు అల్లాడిపోతుంటే పన్నులు పెంచాలనుకోవడం దారుణమన్నారు. అంతకు ముందు సైకిల్పై బయలుదేరిన రాజశేఖర్కు 56వ వార్డు టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు.
Updated Date - 2021-06-24T04:35:52+05:30 IST