అచ్యుతాపురం జంక్షన్ విస్తరణకు సహకరించాలి
ABN, First Publish Date - 2021-08-04T06:15:23+05:30
అచ్యుతాపురం జంక్షన్ విస్తరణకు నిర్వాసితులు సహకరించాలని అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు కోరారు.
అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు
అచ్యుతాపురం, ఆగస్టు 3: అచ్యుతాపురం జంక్షన్ విస్తరణకు నిర్వాసితులు సహకరించాలని అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు కోరారు. మంగళవారం నిర్వాసితులతో ఆయన సమావేశమయ్యారు. పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, తీసుకుంటే వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పరిహారం పెంచాలని నిర్వాసితులు కోరారు. నిబంధనలకు అనుకూలంగానే పరిహారం నిర్ణయించామని ఆర్డీవో తెలిపారు. కేవలం 20 మంది మాత్రమే సంతకాలు చేయలేదని, వీరంతా సహకరిస్తే వెంటనే పరిహారం చెల్లించి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈసమావేశంలో తహసీల్దార్ రాంబాయి, ఎంపీడీవో కృష్ణ, నాయకులు కూండ్రపు వెంకునాయుడు, ఇల్లా లోకనాథం, లాలం శ్రీను పాల్గొన్నారు.
Updated Date - 2021-08-04T06:15:23+05:30 IST