ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి

ABN, First Publish Date - 2021-06-15T05:54:33+05:30

రైతులు, కార్మికుల కన్నీటికి కారణమైన ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు.

దీక్షా శిబిరంలో మాట్లాడుతున్న మంత్రి రాజశేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ 

కూర్మన్నపాలెం, జూన్‌ 14: రైతులు, కార్మికుల కన్నీటికి కారణమైన ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెప్పాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ మంత్రి రాజశేఖర్‌ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెంలో ఉద్యోగులు నిర్వహిస్తున్న రిలే దీక్షలు 123వ రోజు కొనసాగాయి. సోమవారం ఈ దీక్షలలో పాల్గొన్న కార్మికులనుద్దేశించి రాజశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఐక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.   విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాటట్లాడుతూ ఉపాధి అవకాశాలను హరించే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలన్నారు. పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణకు పోరాట పటిమ చూపాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో  విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో కన్వీనర్‌ గంధం వెంకటరావు,    బి.మురళీ రాజు, నీరుకొండ రామచంద్రరావు, మోహన్‌, జగదీశ్‌ కుమార్‌, వరసాల శ్రీనివాసరావు, గంగవరం గోపి, వేములపాటి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-15T05:54:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising