సీఎం దృష్టికి అనకాపల్లి సమస్యలు: ఎమ్మెల్యే అమర్నాథ్
ABN, First Publish Date - 2021-08-03T17:52:59+05:30
అనకాపల్లిలో సమస్యలను..
అనకాపల్లి: అనకాపల్లిలో సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లినట్టు ఎమ్మెల్యే అమర్నాథ్ చెప్పారు. సోమవారం తాడేపల్లిలోని కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. అనకాపల్లిలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎన్టీఆర్ వైద్యాలయంలో వైద్యులు, సిబ్బంది కొరత, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. వాటి పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించి అనకాపల్లిని ప్రగతి పథంలో నడిపేందుకు సహకారమందిస్తానని చెప్పినట్టు చెప్పారు.
Updated Date - 2021-08-03T17:52:59+05:30 IST