ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన ఆయిల్ ట్యాంకర్
ABN, First Publish Date - 2021-04-24T04:30:28+05:30
మండలంలోని మినుములూరు గ్రామ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.
ఇద్దరికి గాయాలు... ఒకరి పరిస్థితి విషమం
పాడేరురూరల్, ఏప్రిల్ 23: మండలంలోని మినుములూరు గ్రామ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. హుకుంపేట మండలం కుంతుర్ల గ్రామానికి చెందిన పాంగి బాబేష్(26), పనసబంధ గ్రామానికి చెందిన సీదరి దేవరాజు(26) గుర్రగరువు గ్రామంలో శుక్రవారం జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తుండగా పాడేరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో వీరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాబేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో కేజీహెచ్కు తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-04-24T04:30:28+05:30 IST