కార్గిల్ వీరులకు ఘన నివాళి
ABN, First Publish Date - 2021-07-27T06:10:32+05:30
కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు సోమవారం బీచ్ రోడ్డులోని విక్టరీ ఏట్ సీ వద్ద ఘనంగా నివాళులర్పించారు.
బీచ్రోడ్డు, జూలై 26: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత సైనికులకు సోమవారం బీచ్ రోడ్డులోని విక్టరీ ఏట్ సీ వద్ద ఘనంగా నివాళులర్పించారు. వార్ మెమోరియల్ వద్ద నేవీ వైస్ అడ్మిరల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్ కుమార్ నాయర్ పుష్పగుచ్ఛం పెట్టి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయనతో పాటు నగర పోలీస్ కమిషనర్ మనీశ్కుమార్సిన్హా, తదితరులు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరులైన సిపాయిల త్యాగాలు మరువలేమన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన నేవీ సిబ్బంది కవాతు అందరినీ ఆకట్టుకుంది.
Updated Date - 2021-07-27T06:10:32+05:30 IST