ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం మత్తులో కాలువలో పడి వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-07-27T05:32:28+05:30

మద్యం మత్తులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. సంజీవయ్యనగర్‌ సీసీ రోడ్డు పక్కన ఉన్న కాలువలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మృతుడు ఖమ్మం జిల్లా వాసి

తాటిచెట్లపాలెం, జూలై 26: మద్యం మత్తులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.    సంజీవయ్యనగర్‌ సీసీ రోడ్డు పక్కన ఉన్న కాలువలో ఈ ఘటన చోటు చేసుకుంది. కంచరపాలెం పోలీసుల కథనం మేరకు....ఖమ్మం జిల్లాకు చెందిన మందపాటి సత్యనారాయణరెడ్డి వ్యాపారస్తుడు. నగరంలోని సంజీవయ్య కాలనీలో ఉంటున్న బంధువుల ఇంటికి ఆదివారం ఉదయం సొంతకారులో వచ్చాడు. సాయంత్రం సొంత పనిమీద అనకాపల్లి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతనికి ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ అని వచ్చింది. పదేపదే ఫోన్‌ చేసినా అదే విధంగా రావడంతో ఏమయ్యిందో అర్థంకాక తెలిసిన వారికి ఫోన్‌ చేశారు. అయినా ఆచూకీ తెలియలేదు.


కాగా సోమవారం ఉదయం కాలువలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బంధువులు హుటాహుటిన వెళ్లి చనిపోయింది సత్యనారాయణరెడ్డేనని గుర్తించారు. మృతునికి మద్యం అలవాటు ఉంది. అనకాపల్లి నుంచి వస్తూ దారి మధ్యలో మద్యం సేవించినట్టు భావిస్తున్నారు. బహుశా యూరినల్స్‌ కోసం కాలువ పక్కన ఆగి మద్యం మత్తులో తూలిపడిపోవడంతో చనిపోయి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కాలువలో మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.  

Updated Date - 2021-07-27T05:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising