ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట్లగరువులో కూలిన పాఠశాల భవనం

ABN, First Publish Date - 2021-09-29T06:23:34+05:30

గులాబ్‌ తుఫాన్‌ ప్రభావానికి కోట్లగరువులోని ఎంపీపీ స్కూల్‌ భవనం మంగళవారం ఉదయం కూలిపోయింది.

కోట్లగరువులో కూలిపోయిన పాఠశాల భవనం.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరురూరల్‌, సెప్టెంబరు 28: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావానికి కోట్లగరువులోని ఎంపీపీ స్కూల్‌ భవనం మంగళవారం ఉదయం కూలిపోయింది. మండలంలోని వంతాడపల్లి పంచాయతీ కోట్లగరువులోని ఎంపీపీ స్కూల్‌లో రెండు భవనాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఒక భవనం కూలిపోగా.. ఉన్న ఒక్క భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురవడంతో మంగళవారం ఉదయం ఉన్న పాఠశాల భవనం కూలిపోయింది. విషయం తెలుసుకున్న సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు వనుగు బసవన్నదొర, వంతాడపల్లి సర్పంచ్‌ మాదెలి రమణమ్మ, గ్రామ వలంటీర్‌, గ్రామపెద్దలు మంగళవారం పాఠశాలను సందర్శించారు. పాఠశాల సెలవు సమయంలో ఈ సంఘటన జరగడం వల్ల భారీ ప్రమాదం తప్పిందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి పాఠశాల ప్రాంగణంలో నూతన భవన నిర్మాణం చేపట్టాలని వారు కోరారు.  

Updated Date - 2021-09-29T06:23:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising