ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3,120 కిలోల రేషన్‌ బియ్యం స్వాధీనం

ABN, First Publish Date - 2021-06-20T04:55:44+05:30

మండలంలోని పలు చోట్ల 3,120 కిలోల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నామని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌ ఆకుల సులోచనారాణి శనివారం తెలిపారు.

స్వాధీనం చేసుకున్న రేషన్‌ బియ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, జూన్‌ 19 : మండలంలోని పలు చోట్ల 3,120 కిలోల రేషన్‌ బియ్యాన్ని పట్టుకున్నామని పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్‌ ఆకుల సులోచనారాణి శనివారం తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం తవ్వవానిపాలెం గ్రామంలో సబ్బవరం సాయినగర్‌ కాలనీకి చెందిన గోవిందరావు గొడౌన్‌లో 750 రేషన్‌ బియ్యాన్ని శుక్రవారం రాత్రి విజిలెన్స్‌ సీఐ కోటేశ్వరరావు తన బృందంతో పట్టుకున్నారు. అదే గ్రామంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీను గొడౌన్‌లో 1500 కిలోలు, శనివారం గొటివాడ గ్రామంలో చోడవరానికి చెందిన ఐతు యువకుమార్‌ నుంచి 450 కిలోలు, సబ్బవరంలో కిలిమి నర్సింగరావు నుంచి 420 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని పెందుర్తి గొడౌన్‌కు తరలించారు. వీరందరిపై 6ఏ కేసులు నమోదు చేశామని ఆమె తెలిపారు.


Updated Date - 2021-06-20T04:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising