Visakha: అరకులోయలో విషాదం
ABN, First Publish Date - 2021-07-17T12:52:36+05:30
అరకులోయలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ముగ్గురు చిన్నారులకు పురుగుల మందు తాగించి..
విశాఖపట్నం: అరకులోయలో విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు చిన్నారులు సహా తల్లి మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ముగ్గురు చిన్నారులకు పురుగుల మందు తాగించి..అనంతరం తల్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Updated Date - 2021-07-17T12:52:36+05:30 IST