విశాఖలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి
ABN, First Publish Date - 2021-05-05T15:34:55+05:30
విశాఖ అరకులోయ మండలం బట్టివలస గ్రామ సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
విశాఖపట్నం: విశాఖ అరకులోయ మండలం బట్టివలస గ్రామ సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మండలంలోని మాదల, ఇరగాయి గ్రామాలకు చెందిన వీరు ద్విచక్ర వాహనంపై అరకులోయ నుంచి లోతేరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు రాజు, లక్ష్మణ్లుగా గుర్తించారు.చీకట్లో అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-05-05T15:34:55+05:30 IST