విశాఖ: గిరిజనుడిని హతమార్చిన మావోయిస్టులు
ABN, First Publish Date - 2021-03-06T15:46:21+05:30
పోలీసుల ఇన్ఫార్మర్ అనే నెపంతో గిరిజనుడిని సిపిఐ మావోయిస్టులు హతమార్చారు.
విశాఖ: పోలీసుల ఇన్ఫార్మర్ అనే నెపంతో గూడెం కొత్తవీధి మండలం, జి.కొత్తపల్లి గ్రామంలో గిరిజనుడిని సిపిఐ మావోయిస్టులు హతమార్చారు. జి. కొత్తపల్లి గ్రామానికి చెందిన గిరిజనుడు కొర్ర పిలుకు (35)ను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. శుక్రవారం రాత్రి కొర్ర పిలుకు ఇంటి దగ్గర వుండగా ఈ ఘటన జరిగింది, అతనికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2021-03-06T15:46:21+05:30 IST