వైసీపీకి విజయసాయిరెడ్డి ఒక శిఖండి: చినరాజప్ప
ABN, First Publish Date - 2021-01-21T21:19:55+05:30
ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత చినరాజప్ప నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి విజయసాయిరెడ్డి
ఏలూరు: ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత చినరాజప్ప నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి విజయసాయిరెడ్డి ఒక శిఖండి అని మండిపడ్డారు. చెప్పులు వేయించే అలవాటు వైసీపీకే ఉందని ఆరోపించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ వన్సైడ్గా వ్యవహరిస్తున్నారని తప్పుబట్టారు. ఎన్నికలపై కోర్టు తీర్పుతో వైసీపీ మంత్రులు తల ఎక్కడ పెట్టుకుంటారు? అని ప్రశ్నించారు. వైసీపీ సుప్రీంకోర్టుకు వెళ్లినా తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అప్పుడు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ను రాజీనామా చేయాలన్న మంత్రులు.. ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారా? అని చినరాజప్ప ప్రశ్నించారు.
Updated Date - 2021-01-21T21:19:55+05:30 IST