దుర్గగుడిలో నేడు కూడా విజిలెన్స్ తనిఖీలు
ABN, First Publish Date - 2021-04-01T13:07:22+05:30
నగరంలోని ప్రఖ్యాత దుర్గగుడిలో గురువారం కూడా విజిలెన్స్ తనిఖీలు
విజయవాడ: నగరంలోని ప్రఖ్యాత దుర్గగుడిలో గురువారం కూడా విజిలెన్స్ తనిఖీలు కొనసాగనున్నాయి. ఆలయంలో అవకతవకలు జరిగాయని బుధవారం జిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆలయ సిబ్బంది లడ్డు, పులిహోర తయారీ లెక్కలు తారుమారు చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే నిత్యాన్నదాన కాంట్రాక్టులో అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్ తనిఖీలు గుర్తించారు.
Updated Date - 2021-04-01T13:07:22+05:30 IST