ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళితులను ఇంతగా కించపరుస్తారా?

ABN, First Publish Date - 2021-04-11T09:25:27+05:30

దళితులను అవమానపరుస్తూ వైసీపీ డిజిటల్‌ విభాగంలో పోస్టులు పెట్టించిన ఆపార్టీ అధ్యక్షుడు జగన్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌, సజ్జలపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: వర్ల రామయ్య

 

మంగళగిరి, ఏప్రిల్‌ 10: దళితులను అవమానపరుస్తూ వైసీపీ డిజిటల్‌ విభాగంలో పోస్టులు పెట్టించిన ఆపార్టీ అధ్యక్షుడు జగన్‌తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను నమోదు చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డికి తన ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. అనంతరం మాట్లాడుతూ తిరుపతి లోక్‌సభకు పోటీచేస్తున్న వైసీపీ అభ్యర్థి డాక్టర్‌ గురుమూర్తి ఓ ఫిజియోథెరపిస్టుగా తన విధులను నిర్వర్తించగా, ఆయన జగన్‌ కాళ్లను ఒత్తుతూ కాళ్లవద్ద కింద కూర్చొని ఉన్నట్టున్న  ఫొటోను  ఉద్దేశ పూర్వకంగా వైసీపీ డిజిటల్‌వింగ్‌లో పోస్టు చేశారని, ఇలా మొత్తం దళితజాతిని కించపరిచారని వర్ల పేర్కొన్నారు. అంటే దళితవర్గాలు ఎప్పుడూ తన కాళ్ల వద్ద ఉంటాయని.. వాళ్లెప్పుడూ తన కాళ్లను ఒత్తుతూ బతకాల్సిందేనన్న భావన వచ్చేలా ఈ పోస్టింగ్‌లను జగన్‌ పెట్టించారని వర్ల ఆరోపించారు.  

Updated Date - 2021-04-11T09:25:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising