దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద కేసు నమోదు
ABN, First Publish Date - 2021-07-28T16:05:09+05:30
మాజీమంత్రి దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు.
విజయవాడ: మాజీమంత్రి దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ కార్యకర్తలు దాడిచేశారు. రాళ్లు, కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన కారు కొంత దెబ్బతినగా... వెనుకే ఉన్న మరో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తిరిగి పోలీసులు దేవినేనిపైనే 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం గమనార్హం.
Updated Date - 2021-07-28T16:05:09+05:30 IST