పోలీసులకు ఉగాది పురస్కారాలు
ABN, First Publish Date - 2021-04-13T09:46:46+05:30
రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఉగాది పురస్కారాలు ప్రకటించింది. సివిల్ పోలీసులతోపాటు అగ్నిమాపక, విజిలెన్స్, అవినీతి
ధర్మాడి సత్యం, ఆర్ఎస్ఐ అర్జునరావులకు ‘ముఖ్యమంత్రి శౌర్య’
అమరావతి, ఏప్రిల్ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పోలీసులకు ఉగాది పురస్కారాలు ప్రకటించింది. సివిల్ పోలీసులతోపాటు అగ్నిమాపక, విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ), ఎస్పీఎఫ్ విభాగాల్లో పని చేస్తూ గడిచిన రెండేళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన 583 మందికి పతకాలు అందిస్తోంది. పోలీసులు గర్వంగా భావించే మహోన్నత సేవ, ముఖ్యమంత్రి సేవ, కఠిన సేవ, ఉత్తమ సేవ పతకాలను సోమవారం ప్రకటించింది. గోదావరి నదిలో మునిగిన బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యం, విజయవాడ బందరు కాల్వలో పడిపోయిన బాలికను రక్షించిన ఆర్ఎ్సఐ అర్జునరావులకు ముఖ్యమంత్రి శౌర్య పతకాలు అందించనుంది.
Updated Date - 2021-04-13T09:46:46+05:30 IST