అమరావతి రైతులది అలుపెరగని పోరాటం: తులసిరెడ్డి
ABN, First Publish Date - 2021-12-17T23:30:42+05:30
అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డిమ అన్నారు
తిరుపతి: అమరావతి రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం తిరుపతిలో జరిగిన రైతుల సభలో ఆయన మాట్లాడారు. ‘‘రాజధాని రైతుల పోరాటానికి నా సెల్యూట్. ఒక రాజధానితోనూ అధికార వికేంద్రీకరణ సాధ్యమే.మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత జగన్రెడ్డిదే. ఏపీకి అమరావతి రాజధాని కల్పవృక్షం. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తే వేల కోట్ల ఆదాయం వచ్చేది. అమరావతే రాజధానిగా కొనసాగిస్తామని జగన్ ప్రకటించాలి’’ అని తులసిరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2021-12-17T23:30:42+05:30 IST