ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు సభపై రాళ్ల దాడి గర్హనీయం: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-04-13T20:11:52+05:30

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు సభపై రాళ్ల దాడి గర్హనీయమని తులసిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారంలో చంద్రబాబు సభపై రాళ్ల దాడి గర్హనీయమని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయడానికి ఇదే తాజా నిదర్శనమన్నారు. అన్నం పెట్టమని అడిగితే చాక్లెట్ ఇచ్చినట్లుగా వాలంటీర్ల విషయంలో జగన్ సర్కార్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. గ్రామ వార్డ్ వాలంటీర్లు 19 నెలలుగా పనిచేస్తున్నా వారికి కనీస వేతనం, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ లేవని, ఉపాధి హామీ పథకం కూలీలకు లభించే మొత్తం కూడా లభించడంలేదన్నారు. ప్రభుత్వం వారితో వెట్టిచాకిరి చేయిస్తోందన్నారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించమని, పీఎఫ్, ఈఎస్ఐ వంటివి అమలు చేయాలని ప్రభుత్వాన్ని వాలంటీర్లు అడిగితే.. జగన్ సర్కార్ అవి చేయకుండా సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలిస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. గోటితో గిల్లుతూ నోటితో జోల పాడినట్లుందని తులసీరెడ్డి ఎద్దేవా చేశారు.


Updated Date - 2021-04-13T20:11:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising