తిరుమల పూర్వవైభవం సంతరించుకోవాలి
ABN, First Publish Date - 2021-10-27T09:26:00+05:30
తిరుమల పూర్వవైభవం సంతరించుకోవాలి
పరిపూర్ణానంద స్వామి
తిరుమల,అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల పుణ్యక్షేత్రంలో తిరిగి పూర్వవైభవం సంతరించుకోవాలని శ్రీవారిని కోరుకున్నట్టు శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి తెలిపారు. మంగళవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నుంచి ఉపశమనం కలిగి స్వామిని రోజుకు లక్ష మంది దర్శించుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు.
Updated Date - 2021-10-27T09:26:00+05:30 IST