శనివారం నుంచి భక్తులకు అనుమతి: టీటీడీ
ABN, First Publish Date - 2021-12-04T01:25:26+05:30
ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రెండో ఘాట్రోడ్డులో శనివారం
తిరుమల: ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రెండో ఘాట్రోడ్డులో శనివారం నుంచి భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండో ఘాట్ రోడ్డు నుంచి లింక్ రోడ్డు ద్వారా వాహనాలను టీటీడీ మళ్లించనుంది. ఘాట్రోడ్డులో ధ్వంసమైన రోడ్లు, రక్షణ గోడల మరమ్మతులను నెలాఖరులోపు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న కొండ చరియలను కెమికల్ టెక్నాలజీతో తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2021-12-04T01:25:26+05:30 IST